బీజేపీ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా మీడియా సెల్లో శ్రేష్ణ తివారీ(24) అనే యువకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తివారీ నాలుగేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో సదరు యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే అదికారిక నివాసంలో తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాతూ…ఉరేసుకున్నాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే నివాసంలో ఎవరూ లేకపోవడం గమనార్హం.
యువకుడి ప్రియురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి చూడగా..అప్పటికే విగత జీవిగా పడి ఉన్నాడు. ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతని ప్రియురాలి ఫోనును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.