శుభశ్రీలా పోజులు కొట్టలేదు.. వాళ్లంతా నన్ను ట్రోల్‌ చేస్తారేమో: దామిని

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ నుంచి సింగర్‌ దామిని ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 10 వారాలు అయినా ఉంటుదనుకున్న దామిని..పేలవమైన ఆటతీరుతో మూడో వారమే బయటకు వచ్చేసింది. ఇంత తర్వగా బయటకు పంపుతారని దామిని కూడా ఊహించలేదట. కనీసం 8 వారాలైన హౌస్‌లో ఉంటానని ఫిక్స్‌ అయి బిగ్‌బాస్‌లోకి వచ్చిందట. నా వరకు అయితే నేను చక్కగా గేమ్‌ ఆడాను. ఆడియన్స్‌కి ఎందుకు నచ్చలేదో అర్థమవుతాలేదు అని దామిని అంటుంది. హౌస్‌ నుంచి బయటకు వచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.


‘మూడో వారమే బయటకు వస్తానని అస్సలు ఊహించలేదు. నన్ను నేను ఎక్కువగా చూపించుకోలేదేమో. ఇంట్లో ఉన్నవాళ్లు నా కన్న ఎక్కువసార్లు కెమెరాకు కనిపించి ఉంటారు. అందరికీ కనపడాలనే ఉద్దేశంతో నేను వంట చేయలేదు. నా వరకు నేను చక్కగా, నిజాయితీగా ఆడాను. నామినేషన్స్‌కి సరైన కారణాలు చేప్పేదాన్ని. ఒకవేళ ఈ వారం హౌస్‌లో ఉండి ఉంటే గేమ్స్‌ బాగా ఆడేదాన్ని. హౌస్‌లో చాలా మంది పని దొంగలు ఉన్నారు. ఈ మూడు వారాల్లో ఒక టాస్క్‌లో మాత్రం గెలవడానికి బాగా ప్రయత్నించాను. యావర్‌ పట్ల అలా వ్యవహరించింది కూడా టాస్క్‌లో భాగమే. కావాలని అతన్ని ఇబ్బంది పెట్టలేదు.


నా ప్రవర్తన నచ్చక ఆడియన్స్‌ నన్ను బయటకు పంపారేమో. ‘నా డ్రెస్‌ పాడైపోతుంది. అంట్లు తోమితే నా గోళ్లు విరిగిపోతాయి’అని శుభశ్రీలా నేను ఎప్పుడు పోజులు కొట్టలేదు. నేను అన్ని నిజాలే చెప్పేశా. ఇప్పుడు బయటకు వెళ్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మిగిలిన కంటెస్టెంట్స్‌ ఫ్యాన్స్‌ నన్ను ట్రోల్‌ చేస్తారేమో’ అని దామిని చెప్పుకొచ్చింది.