టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ. సీఎం జగన్ లీడర్ అయితే చద్రబాబు చీటర్’ అని మంత్రి రోజా అన్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేళంలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉన్నారు. నాలుగుననరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. 40 ఏళ్లలో మహిళల కోసం చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో మహిళలకు రాజకీయంగా సీఎం జగన్ అవకాశాలు కల్పించారు.రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుంది’అని రోజా భరోసా వ్యక్తం చేశారు.