ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకిచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు.
ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. అంతకు ముందు ఎమ్మెల్సీ కోటాలో సీఎం కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించగా.. కొన్నాళ్లు హోల్డ్లో పెట్టారు.కొన్నాళ్ల తర్వాత అనుమతి ఇచ్చారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరు పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అన్నారు.