ముత్తయ్య మురళీధరన్ యువతకు రోల్ మోడల్: వీవీఎస్ లక్ష్మణ్

స్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా సోమవారం హైదరాబాద్ లో ‘800’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్ ఆవిష్కరణ లక్ష్మణ్ చేతుల మీదుగా జరిగింది.

వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ”మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. బాల్యం నుంచి రిటైర్ అయ్యే వరకు, ఇప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. వ్యక్తిగతంగానూ అతనితో పరిచయం ఉంది. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం” అని అన్నారు.

ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ”ఫస్ట్ టైమ్ 1998లో లక్ష్మణ్ ను చూశా. ఒరిస్సాలోని కటక్ లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. ఢిల్లీలో అనుకుంట… ఒక్కసారి నేను అతడిని అవుట్ చేశా. శ్రీలంకలో ఆడినప్పుడు కూడా లక్ష్మణ్ వికెట్ మెండిస్ తీసేవాడు.

నేను అవుట్ చేయలేకపోయేవాడిని. లక్ష్మణ్ గొప్ప క్రికెటర్. నాకు క్లోజ్ ఫ్రెండ్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు మేం చాలా రోజులు కలిసి పని చేశాం. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ… మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు… స్నేహితుల్ని చేసుకోవడం! హైదరాబాద్ నాకు స్పెషల్… నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు.

ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది” అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే… ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ”వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు” అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు.