తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు.. పోలింగ్‌ ఎప్పుడంటే..

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్‌ 30న, రాజస్థాన్‌లో నవంబర్‌ 23న, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న, మిజోరంలో నవంబర్‌ 7న ఒకే విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఛత్తీస్‌గడ్‌లో మాత్రం నవంబర్‌ 7న తొలివిడుత, 17న రెండో విడతలో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్‌ 3న వెలువడనున్నాయి.

తెలంగాణలో ఎన్నికల తేదీలు
నోటిఫికేషన్‌ తేది: నవంబర్‌​ 3
నామినేషన్ల సమర్పణకు చివరి తేది: నవంబర్‌ 10
నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: నవంబర్‌ 15
పోలింగ్‌ తేది: నవంబర్‌ 30
ఓట్ల లెక్కింపు: డిసెంబర్‌ 3