పల్లాపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని పల్లా విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బచ్చన్నపేటలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముత్తి రెడ్డి మాట్లాడుతూ.. పల్లా సమాఖ్య వాది, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని ధ్వజమెత్తాడు.

నీపై ఎన్ని తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నయో నాకు తెలుసు. నాపై తెలంగాణ ఉద్యమ రైల్వే కేసులు ఇంకా ఉన్నవి’’ అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులను అదిష్టానం గమనిస్తోందని, టికెట్‌పై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నారు.

నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు తననే ఎమ్మెల్యేగా ఎనుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని కేసీఆర్‌ తనకే టికెట్‌ కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.