త్వరలో మరికొన్ని సినిమాలు చేస్తాను- సినీ నటుడు & డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ

2023 సంవత్సరం తన సినీ కెరియర్ లో మరిచిపోలేనిది అని హీరో , దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ అన్నాడు.
ఒకే సంవత్సరంలో నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ ఇలా మూడు సినిమాలు విడుదల చేసి ప్రేక్షకులను అలరించడం ఆనందంగా ఉందన్నారు. ‘
కిరాణా షాపు వ్యక్తుల జీవన శైలి గురించి నమస్తే సేట్ జీ సినిమా లో , సీనియర్ నటుడు శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ ని దక్ష సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసాం. అలానే మిస్టరీ సినిమా ద్వారా వెంకట్ పులగం గారు ,వెంకట్ దుగ్గిరెడ్డి లు నిర్మాత లు గా, సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, ఆలీ, సుమన్ లు, హీరోయిన్ గా స్వప్న చౌదరి లు ముఖ్య పాత్రలో చేసిన ఈ సినిమా అక్టోబరు లో విడుదల చేసాం. ఇలా మూడు సినిమాలు 2023 లో విడుదల చేసాం. భవిష్యత్ లో ఇంకా మరెన్నో సినిమా లు తీసి నాకంటూ ప్రత్యేక స్థానాన్ని పరిశ్రమలో ఏర్పాటు చేసుకుంటాను అలానే ఈ మూడు సినిమాలు త్వరలో ఓటీటీ లో కూడా విడుదల చేస్తాం. నాకు తోడుగా నిలిచిన నా గురువు లు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కి, మహేంద్రనాధ్ గారు, నా టీం కి, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకు ధన్యవాదాలు ‘ అన్నారు